Monday, April 29, 2024

దరఖాస్తు చేసుకుంటే పరిశీలిస్తాం: సీరం ఇన్ స్టిట్యూట్ కి సూచించిన ఈయూ

కొవిషీల్డ్ కు అనుమతి కోరుతూ తమకు ఎలాంటి దరఖాస్తు అందలేదని స్పష్టం చేసింది ఈయూ ఔషధ నియంత్రణ సంస్థ. పలు దేశాల నుంచి ఏమంత ప్రాముఖ్యత లేని ప్రయాణాలను తాము అనుమతించడంలేదని, అందులో భారత్ కూడా ఉందని వెల్లడించింది. నిన్నటివరకు కొవిషీల్డ్ కు అనుమతి ఇవ్వాలంటూ తమకు ఎలాంటి విజ్ఞాపన రాలేదని, ఒకవేళ వస్తే తమ విధివిధానాల మేరకు పరిశీలిస్తామని ఈయూ ఔషధ నియంత్రణ సంస్థ హామీ ఇచ్చింది.

భారత్ లో తయారైన కొవిషీల్డ్ కరోనా వ్యాక్సిన్ తీసుకున్నవారికి యూరప్ దేశాల్లో ప్రయాణాలకు ఆటంకాలు ఏర్పడుతున్న నేపథ్యంలో, భారతీయుల్లో ఆందోళన హెచ్చుతోంది. యూరోపియన్ యూనియన్ గ్రీన్ పాస్ పేరిట ఓ జాబితా అమలు చేస్తోంది. ఆ జాబితాలో ఉన్న వ్యాక్సిన్లు తీసుకున్నవారికి తమ దేశాల్లో అనుమతి ఇస్తోంది. ఇటీవలే ఈ జాబితా నుంచి కొవిషీల్డ్ ను తొలగించారు. దీనిపై కొవిషీల్డ్ ఉత్పత్తిదారు సీరం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అధినేత అదర్ పూనావాలా స్పందిస్తూ, ఈ సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు.ఈ నేపథ్యంలో, ఈయూ ఔషధ నియంత్రణ సంస్థ స్పందించింది. 

ఇది కూడా చదవండి: ఆస్ట్రేలియాలో మళ్లీ మొదలైన లాక్ డౌన్..!

Advertisement

తాజా వార్తలు

Advertisement