Monday, April 29, 2024

జూలై 19 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జులై 19 నుంచి ఆగస్టు 13 వరకు జరిగే అవకాశముంది. పార్లమెంటరీ వ్యవహారాలపై ఏర్పాటైన కేబినెట్ కమిటీ ఈ మేరకు తేదీలు సిఫార్సు చేసింది. కరోనా​ దృష్ట్యా.. గతేడాది సాధారణంగా జులైలో ప్రారంభం కావాల్సిన వర్షాకాలం సమావేశాలు సెప్టెంబర్‌లో ప్రారంభమయ్యాయి. అయితే ఈసారి మాత్రం యథావిధిగా జులైలోనే జరుగుతాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ఇదివరకే ప్రస్తావించారు. కొవిడ్​ వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుంచి పార్లమెంటు సెషన్స్​ కుదించినట్లు జోషి పేర్కొన్నారు. మహమ్మారి కారణంగా గతేడాది పార్లమెంటు శీతాకాలపు సమావేశాలు రద్దు చేసినట్లు గుర్తు చేశారు.

ఇది కూడా చదవండి: కరోనా మృతుల్లో ఎక్కువ మంది 50 ఏళ్ల లోపు వారే

Advertisement

తాజా వార్తలు

Advertisement