Tuesday, May 14, 2024

NZB : రైలు కింద పడి యువకుడి ఆత్మహత్య

నిజామాబాద్, ఏప్రిల్ 29(ప్రభ న్యూస్): యువకుడు రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్ప‌డ్డాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఆదివారం అర్థ‌రాత్రి చోటుచేసుకుంది. రైల్వే ఎస్సై కథనం ప్రకారం.. రాత్రి రైల్వే స్టేషన్ లో అజంతా ఎక్స్‌ప్రెస్‌ స్టేషన్ వద్దకు రాగానే ఫ్లాట్ ఫాం పై ఉన్న యువకుడు హఠాత్తుగా రైలుకు అడ్డంగా వెళ్లి ఆత్మహత్యకు పాల్ప‌డిన‌ట్లు రైల్వే ఎస్సై సాయి రెడ్డి తెలిపారు. యువకుడి వివరాలు తెలియరాలేవన్నారు. యువకుడు వైలెట్ కలర్ షర్ట్, బ్లూ జీన్ పాయింట్ ధరించి ఉన్నాడని, ఈ వ్యక్తిని ఎవ రైనా గుర్తుపట్టినట్లయితే త‌మ‌ను సంప్రదించాలని రైల్వే ఎస్సై సాయి రెడ్డి తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement