Tuesday, May 14, 2024

TS : ఇవాళ క‌ర్ణాట‌క‌కు సీఎం రేవంత్

సీఎం రేవంత్‌రెడ్డి ఇవాళ క‌ర్ణాట‌క‌కు వెళ్తున్నారు. రాష్ట్రంలో ఎన్నిక‌ల ప్ర‌చారానికి ఇవాళ రేవంత్‌రెడ్డి విరామం ఇచ్చారు. లోక్ స‌భ ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా కర్ణాట‌క‌లో ప్ర‌చారం నిర్వ‌హించ‌నున్నారు.

- Advertisement -

14 లోక్‌సభ స్థానాల్లో ప్రచారం చేసేందుకు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఇవాళ ఉదయం ఆ రాష్ట్రానికి వెళ్లనున్నారు. మధ్యాహ్నం గుర్మిట్కల్లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో కలిసి ఎన్నికల ప్రచార సభలో రేవంత్‌ రెడ్డి పాల్గొంటారు. సాయంత్రం సేడంలో జరగనున్న ఎన్నికల ప్రచార సభకు కాంగ్రెస్‌ అగ్రనేత ప్రియాంక గాంధీతో కలిసి రేవంత్‌రెడ్డి సభలో హాజరవుతారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement