Wednesday, May 15, 2024

TS : ఇవాళ వరంగల్‌లో ప‌ర్య‌టించ‌నున్న కేసీఆర్‌

మాజీ సీఎం కేసీఆర్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో దూకుడు పెంచారు. వ‌రుస‌గా త‌మ ఎంపీ అభ్య‌ర్థులకు మ‌ద్ధ‌తుగా ప్ర‌చారాలు నిర్వ‌హిస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ వ‌రంగ‌ల్ జిల్లాలో ఆయ‌న ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హించ‌నున్నారు. వరంగల్‌ నుంచి తొర్రూరు, మరిపెడ మీదుగా కేసీఆర్‌ బస్సు యాత్ర సాగనుంది. తొర్రూరు, మరిపెడ మీదుగా కేసీఆర్ బ‌స్సు యాత్ర ఖమ్మం చేరుకోనుంది.

- Advertisement -

కేసీఆర్ పర్యటనకు బీఆర్ఎస్ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేశాయి. గులాబీ బాస్ బస్సు యాత్రకు పెద్ద ఎత్తున జనం తరలివస్తున్నారు. కేసీఆర్ యాత్ర రాత్రి వరకు సాగుతున్నా జనం సమావేశం ముగిసేవరకు ఉంటున్నారు. మరోవైపు ఆదివారం రోజున కేసీఆర్ హనుమకొండలో పర్యటించిన విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల తరువాత తొలిసారి ఓరుగల్లుకు వచ్చిన గులాబీ దళపతికి పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. కాంగ్రెస్ అడ్డగోలు హామీలిచ్చి ప్రజలను వంచించిందని ఆరోపించిన కేసీఆర్ నాలుగు నెలల్లోనే రాష్ట్రాన్ని దివాళా తీయించారని ధ్వజమెత్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement