Thursday, May 16, 2024

ఇద్ద‌రు పిల్ల‌ల‌కు విష‌మిచ్చి : ఆపై తండ్రి ఆత్మ‌హ‌త్య

ఇద్ద‌రు పిల్ల‌ల‌కు విష‌మిచ్చి.. తండ్రి ఆత్మ‌హ‌త్య చేసుకున్న విషాద ఘ‌ట‌న తెలంగాణ రాష్ట్రంలోని న‌ల్ల‌గొండ జిల్లాలో చోటుచేసుకుంది. మృతులు కిష‌న్‌, హ‌ర్షవ‌ర్ధ‌న్ (8), అఖిల్ (6). ఈ ఘ‌ట‌న‌కు కుటుంబ క‌ల‌హాలే కార‌ణ‌మ‌ని స్థానికులు అంటున్నారు. వివ‌రాల్లోకి వెళ్తే…. దామ‌ర‌చ‌ర్ల మండ‌లం నునావ‌త్ తండాలో కిష‌న్ నాయ‌క్ అనే వ్య‌క్తి త‌న భార్య‌తో గ‌త కొంత కాలం నుంచి గొడ‌వ‌లు కొన‌సాగుతున్నాయి. విబేధాలు తారాస్థాయికి చేరుకోవ‌డంతో తీవ్ర మ‌న‌స్థాపానికి గురైన భ‌ర్త త‌న ఇద్ద‌రు కుమారులను పొలానికి తీసుకెళ్లి కూల్ డ్రింక్స్ లో విష‌యం క‌లిపి ఇచ్చాడు. కాసేప‌టికే వారిద్ద‌రూ చ‌నిపోయారు… ఆ త‌ర్వాత కిష‌న్ కూడా చెట్టుకు ఉరేసుకున్నాడు. భార్య‌తో గొడ‌వ‌ల కార‌ణంగానే ఇలా చేసుకున్నార‌ని స్థానికులంటున్నారు. ఇలా ముగ్గురు చ‌నిపోవ‌డంతో ఆ గ్రామంలో విషాద ఛాయ‌లు అలుముకున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement