ఏపీ సీఎం వైఎస్ జగన్ కడప జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ రోజు ఉదయం ఇడుపులపాయ వైఎస్సార్ ఘాట్ వద్ద ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. తన తండ్రి, దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డికి నివాళులర్పించారు. సీఎం జగన్ వెంట మంత్రులు అంజాద్ భాషా, ఆదిమూలపు సురేష్, అప్పలరాజు ఉన్నారు.
కాగా, మూడు రోజుల పర్యటనలో భాగంగా సీఎం జగన్ శుక్రవారం పులివెందుల నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అనంతరం పులివెందులలోని జగనన్న హౌసింగ్ కాలనీకి చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. సాయంత్రం పులివెందుల టీటీడీ కల్యాణ మండపం ఎదురుగా ఉన్న వ్యవసాయ మార్కెట్ యార్డును ప్రారంభిస్తారు. అనంతరం పులివెందులలోని నూతన మోడల్ పోలీస్ స్టేషన్ను ప్రారంభిస్తారు. సాయంత్రం 4.15గంటలకు అంబకపల్లె రోడ్డులోని రాణితోపు పార్కు ఎదురుగా ఉన్న ఆంధ్ర ఆక్వా హబ్ను ప్రారంభించనున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital