Thursday, May 2, 2024

క‌రోనా ఎఫెక్ట్ – పాఠ‌శాల మూసివేత‌..

కోరుట్ల: జగిత్యాల జిల్లాలోని కోరుట్ల మండలంలోని అయిలాపూర్ ఉన్న ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థితోపాటు ప్రధానోపాధ్యాయుడు, మరో టీచర్‌కు కరోనా పాజిటివ్ నిర్ధార‌ణైంది. ముందుగా పాఠశాలలో 9వ తరగతి ఓ విద్యార్థికి కరోనా లక్షణాలు కనిపించాయి. దీంతో అతనికి నిన్న కరోనా పరీక్షలు నిర్వహించారు. అందులో అతనికి పాజిటివ్‌గా తేలింది. దీంతో పాఠశాలలోని విద్యార్థులు, ఉపాధ్యాయులకు కరోనా టెస్టులు చేశారు. ఫలితాల్లో ప్రధానోపాధ్యాయుడు లోకని శ్రీనివాస్, తెలుగు ఉపాధ్యాయురాలు అనూజకు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో స్కూల్‌ మొత్తం శానిటేషన్ చేశారు. పాఠశాల‌కు వారం రోజులు సెల‌వు ప్ర‌క‌టించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement