Monday, May 6, 2024

హీరోగా మారుతోన్న ‘మధు నందన్’

ఆర్టిస్ట్ కం కమెడియన్ గా వెలుగొందుతున్న మధునందన్ హీరోగా మారాడు.   ‘గుండె కథ వింటారా’ అనే థ్రిల్లర్ తో హీరోగా పరిచయం అవుతున్నాడు. వంశీధర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ట్రినిటీ పిక్చర్స్ బ్యానర్ పై క్రాంతి మంగళంపల్లి మరియు అభిషేక్ చిప్ప కలిసి నిర్మిస్తున్నారు. ఇందులో మధునందన్ సరసన స్వాతిష్ట కృష్ణన్ మరియు శ్రేయా నావిలే కథానాయికలుగా నటించారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. ‘గుండె కథ వింటారా’ ఫస్ట్ లుక్ పోస్టర్ లో ఫుల్ గడ్డంతో ఉన్న మధునందన్ సిగరెట్ తాగుతూ ఇంటెన్స్ గా కనిపిస్తున్నాడు. అలానే బైక్ పై కూర్చొని ఏదో తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. టైటిల్ తో పాటు ఈ పోస్టర్ కూడా సినిమాపై మంచి ఇంప్రెషన్ కలిగిస్తోంది. ఈ చిత్రానికి రవివర్మన్ నీలిమేఘం – సురేష్ భార్గవ్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. మసాలా కాఫీ సంగీతం సమకూరుస్తున్నారు. సాయి కిరణ్ ముద్దం ఎడిటింగ్ వర్క్ చేస్తున్న ఈ చిత్రానికి కృష్ణ చైతన్య సాహిత్యం అందిస్తున్నారు. ‘గుండె కథ వింటారా’ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement