Sunday, May 19, 2024

TS : మూడు రోజుల పాటు ప్రియాంక‌గాంధీ ప‌ర్య‌ట‌న‌

కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు తెలంగాణలో పర్యటించనున్నారు. కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా ఆమె ప్రచారాన్ని నిర్వహించనున్నారు. నేటి సాయంత్రం హైదరాబాద్ కు ప్రియాంక గాంధీ చేరుకుంటారు. ఆమెకు విమానాశ్రయంలో కాంగ్రెస్ రాష్ట్ర స్థాయి నేతలు భారీ స్వాగతం పలికేందుకు ఏర్పాటు చేశారు.

- Advertisement -

రేపు ఉదయం 11 గంటలకు కామారెడ్డిలో నిర్వహించే బహిరంగ సభలో ప్రియాంక గాంధీ పాల్గొంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. అదే రోజు సాయంత్రం కూకట్‌పల్లిలో జరిగే కార్నర్ మీటింగ్ లో పాల్గొని అభ్యర్థి మద్దతుగా ప్రచారాన్ని నిర్వహిస్తారు. మే 8వ తేదన సాయంత్రం సికింద్రాబాద్ లో జరిగే రోడ్ షోలో ప్రియాంక గాంధీ పాల్గొంటారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement