Sunday, May 26, 2024

TS : రాష్ట్రానికి బీజేపీ అగ్రనేతల క్యూ…నల్గొండ బహిరంగ సభకు జేడీనడ్డా

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణలో మరోసారి పర్యటించనున్నారు. ఆయన భువనగిరిపార్లమెంట్​ పరిధిలో ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. అలాగే రాష్ట్రంలో రాజస్థాన్ సీఎం భజన్‌లాల్ శర్మ, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్‌ధామి, తమిళనాడు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు.

- Advertisement -

తొలుత పెద్దపల్లి అభ్యర్థి గోమాస శ్రీనివాస్‌కు మద్దతుగా నిర్వహించే సభకు జేపీ నడ్డా హాజరై అనంతరం మధ్యాహ్నం భువనగిరి పార్లమెంట్ పరిధిలోని చౌటుప్పల్‌లో జరిగే బహిరంగ సభలో నడ్డా పాల్గొంటారు. ఆ తర్వాత నల్గొండ నిర్వహించే సభలో నడ్డా పాల్గొననున్నారని పార్టీనేతలు వెల్లడించారు. మరోవైపు ఈ ఉదయం ముషిరాబాద్‌ మీటింగ్‌లో ఉత్తరాఖండ్ సీఎం పాల్గొని మధ్యాహ్నం 12.30 కు నర్సంపేట సభకు హాజరవుతారు. సాయంత్రం సికింద్రాబాద్‌లోని సమ్మేళనంలో గుజరాత్ సీఎం పాల్గొననుండగా.. జమ్మికుంటలో తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై ప్రచారం నిర్వహిస్తారు. ఆ తర్వాత కల్వకుర్తి సభలో పాల్గొని.. అనంతరం సనత్‌నగర్ నుంచి పద్మారావునగర్ వరకు బైకు ర్యాలీలో పాల్గొంటారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement