Sunday, May 19, 2024

AP : మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లో సీఎం జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న

సీఎం జగన్ ఇవాళ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు. మూడు నియోజకవర్గాల్లో ఆయన పర్యటించనున్నారు. నిన్న ప్రచారానికి విరామమిచ్చిన జగన్ నేడు మళ్లీ ప్రచారాన్ని ప్రారంభించనున్నారు.

- Advertisement -

ఇవాళ‌ ఉదయ బాపట్ల జిల్లాలోని రేపల్లె నియోజకవర్గంలో జరిగే ప్రచార సభలో జగన్ పాల్గొంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
మధ్యాహ్నం 12.30 గంటలకు నరసరాపుపేట లోక్‌సభ పరిధిలోని మాచర్లలో జరిగే సభకు ఆయన హాజరవుతారు. తిరిగి సాయంత్రం మచిలీపట్నంలో జరిగే ప్రచారంలో ఆయన పాల్గొంటారు. జగన్ సభలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇంకా ప్రచారానికి ఎక్కువ రోజుల సమయం లేనందున జగన్ విస్తృతంగా నియోజకవర్గాలను చుట్టివచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement