Friday, May 17, 2024

టీ20 ర్యాంకుల్లో భారత ఆటగాళ్ల సత్తా

ఐసీసీ టీ20 బ్యాట్స్‌మెన్ ర్యాంకుల్లో మరోసారి భారత ఆటగాళ్లు తమ సత్తా చాటారు. కేఎల్ రాహుల్ 816 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ 697 పాయింట్లతో ఒక స్థానం మెరుగుపరుచుకుని ఆరో స్థానానికి చేరాడు. ఈ జాబితాలో 916 పాయింట్లతో ఇంగ్లండ్ ఆటగాడు డేవిడ్ మలాన్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. బాబర్ ఆజమ్, అరోన్ ఫించ్, వాండర్ డుసెస్ 3, 4, 5 స్థానాల్లో ఉన్నారు. ఇటీవల ఆసీస్‌తో జ‌రిగిన తొలి రెండు టీ20ల్లో రాణించిన న్యూజిలాండ్ ఆటగాళ్లు కాన్వే, గ‌ప్టిల్ ఈ తాజా ర్యాంకుల్లో మెరుగైన ర్యాంకులు సాధించారు. తొలి టీ20లో 99 ప‌రుగులు చేసిన కాన్వే ఏకంగా 46 స్థానాలు ఎగ‌బాకి 17వ స్థానంలో నిల‌వ‌గా.. రెండో టీ20లో 97 ప‌రుగులు చేసిన గప్టిల్ మూడు స్థానాలు ఎగ‌బాకి 11వ ర్యాంకు సాధించాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement