Friday, April 26, 2024

టీఆర్‌ఎస్‌లో చేరికలు..

బెల్లంపల్లి : నాగార్జున సాగర్‌ నియోజకవర్గం ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా పెద్దపుర మండలం గర్నెకుంట గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వవిప్‌, ఎమ్మెల్యే బాల్క సుమన్‌ ఆధ్వర్యంలో రామంజీ యాదవ్‌ అధ్యక్షతన బిజెపి, కాంగ్రెస్‌ లకు చెందిన 150 మంది కార్యకర్తల టీఆర్‌ఎస్లో చేరారు. ఈ సందర్భంగా బాల్క సుమన్‌ మాట్లాడుతూ తెరాస ఎమ్మెల్యే అభ్యర్థి నోముల భగత్‌ కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని గ్రామస్తులను కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్‌ కముసమ్మ, రైతు సమన్వయ సమితీ అధ్యక్షుడు నాగేశ్వర్‌రావు, మాజీ సర్పంచ్‌ నడ్డి లక్ష్మయ్య యాదవ్‌, కాటబోయిన ఏడుకొండలు, గ్రామపంచాయితీల్లో తెరాస పార్టీ ఇంచార్జి నడిపెల్లి విజిత్‌రావు, జెడ్‌పీటీసీ కృష్ణారెడ్డి, డీవీన్‌రెడ్డి, ఇంచార్జి బడికెల సంపత్‌కుమార్‌, తెరాస రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోగుల రవీందర్‌రెడ్డి, తెలంగాణ గొర్రెల, మేకల సంఘం రాష్ట్ర కార్యదర్శి కొమ్ము అశోక్‌ యాదవ్‌, తెరాస పార్టీ గ్రామ అధ్యక్షుడు శంకర్‌, పిల్లి ఏడుకొండలు, ఘనపురం శంకర్‌, రాంబాబు, వార్డు సభ్యులు తిరుపతిరావు, డీలర్‌ వెంకటయ్య, పి.వెంకటరావు, రామ పరమేష్‌, మర్రి లక్ష్మణ్‌, పవన్‌, శివ, కొండల్‌ సాయిరాం, ఈశ్వర్‌ డిజే శ్రీనివాస్‌ యాదవ్‌, సైదులు, ఈదయ్య పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement