Sunday, May 19, 2024

విలేఖరిని దూషించిన వ్యక్తులను అరెస్ట్‌ చేయాలి..

జన్నారం: మండలంలోని తిమ్మాపూర్‌కు చెందిన ఓ పత్రిక విలేఖరి వెంకటస్వామిని దూషించిన వ్యక్తులను వెంటనే అరెస్ట్‌ చేయాలని జన్నారం ప్రెస్‌క్లబ్‌ అధ్యక్షుడు చిలువేరు నర్సయ్య అన్నారు. జన్నారంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కొందరు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు వ్యవసాయ భూముల్లో మొరం పోస్తుండగా అక్కడికి వెళ్లి ఫోటో తీసిన విలేఖరిని నానా దుర్భాషలాడి చంపుతామని ఫోన్‌లో బెధిరించారని, వారిని కఠినంగా శిక్షించాలని అన్నారు. ఈ సమావేశంలో సంఘం నేతలు మందపల్లి కాంతయ్య, గాజుల లింగన్న, ఎస్‌.చంద్రశేఖర్‌, జె.వెంకటి, కె.వేణుగోపాల్‌ గుప్త తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement