Friday, May 24, 2024

మహిళలకి పోషక విలువలు ఉన్న ఆహారం..

జన్నారం : గర్భిణీ మహిళలు మంచి పోషక విలువలు ఉన్న ఆహారాన్ని తీసుకోవాలని జన్నారం ఎంపీటీసీ సభ్యులు ఎం.డి.రియాజ్‌ ఉద్దిన్‌ అన్నారు. అంగన్‌వాడీ పోషణ పక్షోత్సవ కార్యక్రమంలో భాగంగా జన్నారం అంగన్‌వాడీ కేంద్రంలో డ్వాక్రా ఎస్‌హెచ్‌జి గ్రూప్‌ మహిళలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అతిథులుగా హాజరైన ఆయన మాట్లాడుతూ మహిళల్లో రక్తహీనత ఏర్పడినప్పుడు సంబంధిత అంగన్‌వాడీ సెంటర్‌లో సంప్రదిస్తే పోషక విలువలు ఉన్న ఆహారాన్ని అందిస్తారని అన్నారు. ముఖ్యంగా మహిళలు శుభ్రత పాటిస్తూ నిర్ణీత సమయానికి ఆహారం తీసుకోవాలని చెప్పారు. ఈ సమావేశంలో స్థానిక అంగన్‌వాడీ టీచర్‌ జి.సుజాత, గ్రామ సర్పంచ్‌ బి.గంగాధర్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement