Thursday, May 9, 2024

అసత్య ఆరోపణలు వద్దు..

బెల్లంపల్లి : గురుకులాల కార్యదర్శి ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అసత్య ఆరోపణలు చేస్తున్నారని అంబేడ్కర్‌ పూలే మహాజన సంఘం బెల్లంపల్లి పట్టణ అధ్యక్షుడు గొడిసెల రసజ్ఞ అన్నారు. పట్టణంలోని టేకులబస్తీ అంబేడ్కర్‌ పూలే మహాజన సంఘం ఆధ్వర్యంలో డాక్టర్‌ ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చేస్తున్న అసత్య ఆరోపణలను ఖండిస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లా దూలికట్టులో బౌద్దులు చేస్తున్న ప్రతిజ్ఞను ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌కు, స్వేరోస్‌కు అంటకట్టడం సరికాదని, కుల, మతాలకు అతీతంగా బడుగు, బలహీన వర్గాల బిడ్డల అభ్యున్నతికి ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ గురుకులాల ద్వారా పాటుపడుతున్నారని, అలాంటి వారిపై అసత్య ఆరోపణలు చేస్తే అంబేడ్కర్‌ పూలే మహాజన సంఘం ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళనలను చేపడుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సతీష్‌, ప్రణీత్‌, సన్ని, వంశీ, విశ్వనాథ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement