Monday, May 20, 2024

Twitter – ఈడీ, ఐటీ, సీబీఐ మౌన‌మేల.. మోదీని నిల‌దీసిన కేటీఆర్‌

అదానీ, అంబానీ కాంగ్రెస్‌ పార్టీకి టెంపోల నిండా డబ్బు పంపుతుంటే ప్రధాని మోదీకి అత్యంత ఇష్టమైన ఈడీ, సీబీఐ, ఐటీ ఎందుకు మౌనంగా ఉన్నాయ‌ని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ నిలదీశారు. అదానీ, అంబానీ నుంచి ఎన్ని టెంపో లోడ్ల ధనం ముట్టింది? ఏం ఒప్పందం కుదిరింది? రాత్రికి రాత్రే కాంగ్రెస్ పార్టీ నుంచి అంబానీ, అదానీపై ఆరోపణలు ఆగిపోయాయి’ అన్న మోదీ వ్యాఖ్యాల‌పై కేటీఆర్‌ ఎక్స్ (ట్విట్ట‌ర్‌) వేదిగా స్పందించారు. అన్ని తెలిసి ఎందుకు మౌనంగా ఉంటున్నారు మోదీజీ అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. డ‌బ్బు క‌ట్ట‌లు టెంపోల‌లో వెళుతున్నాయంటే మీ నోట్ల రద్దు విఫలమైనట్టేనా అని ప్రధానిని ప్రశ్నించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement