Monday, May 13, 2024

బిజెపి నిరసన..రాస్తారోకో

బెల్లంపల్లి: హిందూ వ్యతిరేక స్వేరోస్‌ వ్యవస్థాపకుడు, ప్రభుత్వ ఐపీఎస్‌ అధికారి ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ అనుచరులు సూర్యపేట జిల్లాలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడటాన్ని ఖండిస్తూ బిజెపి పట్టణ అధ్యక్షుడు కోడి రమేష్‌ ఆధ్వర్యంలో కాంటా చౌరస్తా వద్ద రాస్తారోకో నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కోడి రమేష్‌ మాట్లాడుతూ గత 7 సంవత్సరాలుగా ఐపీఎస్‌ అధికారి హోదాలో ఒకే శాఖకు గురుకులాల కార్యదర్శిగా విధులు నిర్వహిస్తూ స్వేరోస్‌ అనే సంస్థను ఎలా ఏర్పాటు చేస్తారు, అలా చేయడమే తప్పు, అంతేకాకుండా హిందూ వ్యతిరేక భావాజాలాలను విద్యార్థుల మనసుల్లో విషబీజాలుగా నాటుతూ హిందూ దేవుళ్లను కించపరుస్తూ ప్రతిజ్ఞ చేస్తూ వందేమాతర గీతానికి బదులుగా హిందూ వ్యతిరేక గీతాలను పాడిస్తూ విద్యార్థి దశ నుండే దేశ విచ్చిన్నానికి పౌరులను తయారు చేస్తున్నారని, అదేవిధంగా గురుకులాలు హిందూ సనాతన ధర్మంలో భాగమేనని, మీరు కొత్తగా తెచ్చిన గురుకులాలు కావని, అయితే అధికారి స్వేరోస్‌ ఆగడాలను అరికట్టే పరిస్థితిలో దొరగారి ప్రభుత్వం లేదని, కోర్టు అండదండలతోనే నడుస్తున్న స్వేరోస్‌ సంస్థను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని, ఐపీఎస్‌ అధికారి ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ను సస్పెండ్‌ చేయాలని, లేనియెడల రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలను చేపడుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రాచర్ల సంతోష్‌, సబ్బని రాజనర్సు, రేవెల్లి రాజలింగు, ఎరుకల శ్రీనివాస్‌, కోడి సురేష్‌, కల్లెపల్లి నవీన్‌, ఎరుకల నర్సింగ్‌, గోలి శ్రీనివాస్‌, మేకల రాజశేఖర్‌, అడిచెర్ల రాంచందర్‌, ముడిమడుగుల శ్రీనివాస్‌, సంతోష్‌ అగర్వాల్‌, అడిచెర్ల రమేష్‌, కునిరాజుల అరవింద్‌, అంబాల శివసాయి, జూపాక సాయి, మంతెన అజయ్‌, ఎరుకల మనోహర్‌, గందం అనీల్‌, శ్యాం, జీదుల రాములు, సట్ల రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement