Tuesday, July 23, 2024

ADB : ఓటు వేయకుండా నిరసన

కాసిపేట, మే 13 (ప్రభన్యూస్) మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం కాసిపేట మండలం వరిపేట గ్రామస్థులు ఓటు వేయకుండా నిరసన తెలిపారు. సోమవారం జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో గ్రామంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి వెల్లకుండా గ్రామస్థులు ఆందోళన చేపట్టారు.

- Advertisement -

గ్రామం లో తాగు నీరు సమస్య వేసిస్తున్నదని, పాటశాల, అంగన్వాడీ కేంద్రం, ప్రత్యేక గ్రామ పంచాయతీ నీ ఏర్పాటు చేయాలని డిమాండ్ తో ఓటు వేసేందుకు నిరాకరించారు. అయితే అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సైతం ఇవే సమస్యలపై ఓటు వేయడానికి ముందుకురాక పోవడంతో అప్పటి అధికారులు, నాయకులు, సమస్యలపై హామీ ఇవ్వడంతో ఆలస్యంగా కేంద్రాలకు వెళ్లి ఓట్లు వేశారు. ఆనాడు అదికారులు ఇచ్చిన హామీలు పట్టించుకోలేదని, సమస్యలు అలాగే వున్నాయని ఆరోపణలతో నిరసనలు చేపట్టినట్టు వారు తెలిపారు. అయితే మధ్యాహ్నం వరకు గ్రామస్థులు పోలింగ్ కేంద్రాలకు వెల్లకుండా నిర‌స‌న చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement