Monday, May 20, 2024

TS: మంత్రి తుమ్మ‌ల స‌మ‌క్షంలో.. కాంగ్రెస్ లో చేరిన వాజేడు జెడ్పీటీసీ, ఎంపీపీ

వాజేడు, మే 9 (ప్రభ న్యూస్) : ములుగు జిల్లా వాజేడు మండలానికి చెందిన జెడ్పీటీసీ తల్లడి పుష్పలత, ఎంపీపీ శ్యామల శారద గురువారం రాష్ట్ర‌ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమక్షంలో భద్రాచలం కేంద్రంగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. జెడ్పీటీసీ, ఎంపీపీల‌కు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

వీరితో పాటు పూసూరు గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీకి చెందిన‌ పలువురు నాయకులు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వాజేడు మండలంలోని భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు అనుచరులు కాంగ్రెస్ పార్టీలోకి చేరడంతో బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుందని వాదనలు వినిపిస్తున్నాయి. వీరి చేరికతో బీఆర్ఎస్ పార్టీకి భారీ నష్టం జరుగుతుందని వాదనలు వినిపిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement