Monday, May 20, 2024

TS: ఉపాధి హామీ కూలీల వద్దకు బైక్ పై వెళ్లిన మంత్రి సీతక్క

నిర్మల్ ప్రతినిధి, మే 8 (ప్రభ న్యూస్) : నిర్మ‌ల్ జిల్లాలో రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి అండ్ శిశు సంక్షేమ శాఖ మంత్రి డా. ద‌న‌స‌రి (అన‌సూయ) సీతక్క వినూత్న‌ రీతిలో ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హించారు. ద్విచ‌క్ర వాహ‌నంపై వెళ్లి ఉపాధి హామీ ప‌నుల‌ను ప‌రిశీలించి, కూలీల‌ను స‌మ‌స్య‌ల‌ను తెలుసుకున్నారు మంత్రి సీత‌క్క‌. బుధవారం నిర్మ‌ల్ జిల్లాలోని ర‌త్నాపూర్‌, వ‌డ్యాల‌, రాజ‌పూర్‌, అబ్బాపూర్ గ్రామాల్లో ఉపాధి హామీ కూలీల‌తో క‌లిసి ప్ర‌చారం నిర్వ‌హించారు. ఈ ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో మంత్రి వెంట కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement