Monday, May 20, 2024

Donation – సింహాద్రి అప్పన్నకు రూ.4లక్షల విరాళం

( ఆంధ్రప్రభ , సింహచలం) – సింహచలం శ్రీ వరాహాలక్ష్మీ నృసింహ స్వామి చందనోత్సవం సందర్భంగా విశాఖపట్నంలోని రైల్వే న్యూకాలనీకి చెందిన అక్షయ ఆసుపత్రి యాజమాన్యం రూ. 4 లక్షల విరాళం అందజేసింది. రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్‌ ఎస్‌. సత్యనారాయణకు ఈ చెక్కును అందజేశారు.దేవస్ధానం నిర్వహిస్తున్న నిత్య అన్నదాన పధకానికి వినియోగించాలని ఆసుపత్రి యాజమాన్యం కోరింది. ఈ సందర్భంగా కమిషనర్‌ ఎస్‌.సత్యనారాయణ మాట్లాడుతూ, దేవాలయాల అభివృద్ధిలో దాతల సహకారం అత్యంత ప్రశంసనీయమన్నారు. ఎంతో మంది స్వచ్చందంగా ముందుకు వచ్చి ఆలయాలకు విరాళాలు అందజేస్తున్నారన్నారు.సింహచలం దేవస్ధానంలో పలు దేవాలయల్లో భక్తుల సంఖ్యకు తగ్గట్లుగా నిత్య అన్నదానం నిర్వహిస్తున్నామన్నారు.

ఈ కార్యక్రమంలో దేవదాయ శాఖ అదనపు కమిషనర్‌ కె.రామచంద్రమోహన్‌, ఆలయ ఈవో సింగాల శ్రీనివాసమూర్తి, పాల్గొన్నారు. సమన్వయకర్తగా ఆలయ ధర్మకర్తల మండలి మాజీ సభ్యులు గంట్ల శ్రీనుబాబు వ్యవహరించారు. ఈ సందర్భంగా దాతలకు చందనోత్సవ రోజున స్వామి నిజరూప దర్శనం భాగ్యం కల్పిస్తున్నట్లు గంట్ల శ్రీనుబాబు చెప్పారు.సింహగిరి పై గురువారం సాము గరిడీల కోలహలం నెలకొంది

Advertisement

తాజా వార్తలు

Advertisement