Saturday, May 25, 2024

ఆటోని ఢీ కొట్టిన తుఫాన్.. ముగ్గురు మృతి

వరంగల్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆత్మకూరు మండలం నీరుకుళ్ల వద్ద తుఫాన్‌ వాహనం ఆటోను ఢీకొట్టింది. ఘటనలో ముగ్గురు మహిళలు మరణించారు. మరో ఏడుగురు మహిళలకు గాయాలయ్యాయి. వీరిని వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ములుగు నుంచి వరంగల్ వైపు వెళ్తున్న తుఫాన్‌.. వరంగల్‌ నుంచి దుగ్గొండి వైపు వెళ్తున్న ఆటోను ఢీకొట్టింది. తుఫాను వేగంగా వచ్చి ఆటోను ఢీకొట్టడంతో అందులో ఉన్న వారంతా చెల్లాచెదురుగా రోడ్డుపై పడిపోగా..ఆటో నుజ్జునుజ్జయింది. ప్రమాదం జరిగిన సమయంలో ఆటోలో డ్రైవర్‌ సహా 19 మంది కూలీలు ఉన్నారు. దుర్ఘటనపై మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌ రావు, సత్యవతి రాథోడ్‌ విచారం వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు తీవ్ర సంతాపం తెలిపారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement