Monday, May 6, 2024

TS : రాష్ట్రంలో ప్రజా ఉపయోగకరమైన పథకాలు…. ఎంపీ అభ్యర్థి సుగుణ

జన్నారం,ఏప్రిల్2(ప్రభ న్యూస్): గతంలో ఎన్నడు కనివిని ఎరుగని విధంగా రాష్ట్రంలో ప్రజా ఉపయోగకరమైన పథకాలను కాంగ్రెస్ ప్ర‌భుత్వం ప్రవేశపెట్టిందని ఆదిలాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణ తెలిపారు. మంగ‌ళ‌వారం మంచిర్యాల జిల్లా జ‌న్నారంలో నిర్వ‌హించిన కార్య‌క‌ర్త‌ల స‌మావేశానికి ఆమె హాజ‌ర‌య్యారు.

- Advertisement -

ఈసంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ ప్ర‌భుత్వం ప్రజల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తుందని ఆమె చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ నేతలు,కార్యకర్తలు అందరూ కష్టపడి పని చేసి తన గెలుపు కోసం కృషి చేయాలని కోరారు. గ్రామాలలోని పలు సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈకార్యక్రమంలో ఖానాపూర్ఎమ్మెల్యే వెడమ బొజ్జు పటేల్,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ముజఫర్అలీ ఖాన్, ప్రజా ప్రతినిధులు ఎంపీటీసీలు, సీనియర్ నేతలు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement