Sunday, April 28, 2024

TS: మహబూబాబాద్ గెలిచి తీరాలి.. మంత్రి తుమ్మ‌ల దిశానిర్దేశం

ఇల్లందు : మహబూబాబాద్ పార్లమెంట్ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి పొరికా బలరాం నాయక్ గెలిచి తీరాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. మహబూబా బాద్ పార్లమెంట్ కాంగ్రెస్ సన్నాహక సమావేశం ఈ రోజు ఎమ్మేల్యే క్యాంప్ కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో తుమ్మల మాట్లాడుతూ.. ఎదుటి వారి బలహీనతలపై దెబ్బకొట్టే ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు.

ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. ఈ పార్లమెంట్ స్థానంలో కాంగ్రెస్ తిరుగులేని ఆధిక్యతను సాధించేందుకు ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, మణుగూరు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, డోర్నకల్, నర్సం పేట మహబూబ్ బాద్ ఎమ్మెల్యేలు, కొత్తగూడెం కాంగ్రెస్ అధ్య‌క్షులు పొదేం వీరయ్య పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement