Monday, May 13, 2024

TS : మ‌న‌లో మ‌న‌కే ప‌డ‌కే ఓడిపోయాం… కేటీఆర్

మనలో మనకే ఓర్వలేని తనం ఎక్కువైందని.. అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో మనల్ని మనమే ఓడించుకున్నామని అన్నారు బిఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ . ఒకరికి పెత్తనం ఇస్తే మరొకరికి కోపం వస్తుందని.. ఈ ఓర్వలేనితనం వల్లే పార్టీలో సమన్వయలోపం జరిగిందని అంగీక‌రించారు..అయితే ఈ లోక్ స‌భ ఎన్నికల్లో అలా జరగకుండా అప్రమత్తం అయ్యామని తెలిపారు.

- Advertisement -

వేములవాడలో నేడు జ‌రిగిన బీఆర్ఎస్ నియోజకవర్గ బూత్ కార్యకర్తల సమావేశంలో ఆయ‌న మాట్లాడుతూ, . 400 సీట్లు వస్తే రాజ్యాంగం, రిజర్వేషన్లు తొలగిస్తామని మోదీ అంటున్నార‌ని మండిపడ్డారు. ఎన్డీఏ సర్కార్ అరాచకాలను అడ్డుకునే సత్తా గులాబీ జెండాకే ఉందని తెలిపారు. వంద రోజుల్లో ఆరు గ్యారంటీల పేరుతో చోటే భాయ్‌ మోసం చేశారని, 2014లో బడా భాయ్‌ మోసం చేశారని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలపై కేటీఆర్ ధ్వజమెత్తారు.
“రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్నారు. రైతుల కష్టాలు మాత్రం రెట్టింపు అయ్యాయి. ఏటా 2 కోట్ల ఉద్యోగాల పేరుతో మోసం చేశారు. జన్‌ధన్‌ ఖాతాలు తెరిస్తే రూ.15 లక్షలు జమ చేస్తామన్నారు. తెలంగాణ పుట్టుకను అవమానించిన వ్యక్తి మోదీ. పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. కాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్‌ ఫ్యాక్టరీ హామీలు నెరవేర్చలేదు. పదేళ్లలో దేశ ప్రజలకు తీరని ద్రోహం చేశారు.” అని కేటీఆర్ మండిపడ్డారు.

పదేళ్లలో దేశ ప్రజలకు ప్రధాని మోదీ తీరని ద్రోహం చేశారని ఆరోపించారు. అన్ని ధరలు పిరం చేసిన పిరమైన ప్రధాని.. మోదీ అని విమర్శించారు. మతం పేరుతో ప్రజల మనసుల్లో విషం నింపుతున్నారని, అన్ని గ్రామాల్లో బీఆర్ఎస్కు కనీసం వంద మందికి పైగా కార్యకర్తలు ఉన్నారని తెలిపారు. అదే బీజేపీ ఒకరిద్దరున్నా వాళ్లు పెత్తనం చెలాయిస్తున్నారని అన్నారు. ఆ ఒక్కరిద్దరిపై బీఆర్ఎస్ పైచేయి సాధించలేకపోతోందని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement