Monday, July 22, 2024

Shweta Basu Prasad : కొత్త బంగారు లోకం షో…

తెలుగు ప్రేక్షకులకు కొత్త బంగారు లోకం సినిమాతో పరిచయం అయిన ముద్దుగుమ్మ శ్వేతా బసు ప్రసాద్. ఈ అమ్మడు దూరదర్శిని సీరియల్స్ లో బాల నటిగా నటించడం ద్వారా కెరీర్ ను ఆరంభించింది. బెంగాళి, తెలుగు, తమిళ భాషల సినిమాలతో పాటు హిందీ లో కూడా నటించి మెప్పించింది.

- Advertisement -

టాలీవుడ్‌ ప్రేక్షకులకు కొత్త బంగారు లోకం సినిమాలో నటించడం ద్వారా హీరోయిన్ గా దగ్గర అయిన ఈ అమ్మడు తక్కువ సమయంలోనే స్టార్‌ గా గుర్తింపు దక్కించుకుంది. కానీ ఈ అమ్మడికి అదృష్టం కొనసాగలేదు. ఈమె నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడటంతో ఆఫర్లు కనుమరుగయ్యాయి. కొన్నాళ్లు ఉత్తరాదిన సందడి చేసిన ఈ అమ్మడు మళ్లీ సౌత్ లో కూడా కనిపించేందుకు ప్రయత్నాలు చేస్తుంది.

ఆ మధ్య బొద్దుగా కనిపించిన శ్వేతా బసు ఈ మధ్య కాలంలో చాలా సన్నగా నాజూకుగా తయారు అయ్యింది. ఇంతటి అందం స్టార్‌ హీరోయిన్స్ కి కూడా అసాధ్యం అంటూ ఆమె ఫాలోవర్స్ కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా షేర్ చేసిన ఫోటోలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. క్రాప్ టాప్‌ లో క్లీ వేజ్ అందాలను చూపిస్తూ ఈ అమ్మడు చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఆకట్టుకునే అందంతో పాటు మంచి ఫిజిక్ అంటూ శ్వేతా బసు గురించి నెటిజన్స్ తెగ మాట్లాడుకుంటున్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement