Tuesday, July 23, 2024

History – మ‌న ఎన్నిక‌ల‌ ప్ర‌స్థానానికి 75 ఏళ్లు – హైటెక్ ఓటింగ్‌!


18వ లోక్‌సభ ఏర్పాటు కోసం సార్వత్రిక ఎన్నిక‌లు జ‌ర‌గుతున్నాయి. దేశంలో ద‌శ‌ల‌వారీగా ఎన్నిక‌లు జ‌ర‌గుతున్నాయి. ఏపీ తెలంగాణ‌లో నాలుగో ద‌శ పోలింగ్ ఉత్సాహంగా జ‌రుగుతోంది. కాగా, ఈసారి ఎన్నిక‌ల సంఘం టెక్నాల‌జీని వినియోగించుకుంటోంది. గ‌తంలో ఎన్నిక‌లు ఎలా జ‌రిగేవి.. ఇప్పుడు లేటెస్ట్ సిచ్యుయేష‌న్ ఎంట‌న్న‌ది తెలుసుకుందాం.. ఇంతకీ ఈసీని ఎప్పుడు ఏర్పాటుచేశారు? 75 ఏళ్లలో ఎన్నికల నిర్వహణలో ఎలాంటి మార్పులొచ్చాయనే అంశాల‌ను ప‌రిశీలిస్తే ఆసక్తికరమైన అంశాలు బయటపడుతున్నాయి.

దేశం గణతంత్రంగా మారడానికి ఒక్క రోజు ముందు అంటే 1950 జనవరి 25న కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి 17 సార్వత్రిక, అనేక అసెంబ్లీ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించింది. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతుల ఎన్నికలనూ నిర్వహించింది. ఈ ఏడున్నర దశాబ్దాల కాలంలో పోలింగ్‌ ప్రక్రియలో సాంకేతికంగా అనేక మార్పులు వచ్చాయి. బ్యాలెట్‌ బాక్సుల నుంచి ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల శకంలోకి మారాం.

- Advertisement -

ఈ సారి జరిగే సార్వత్రిక ఎన్నికల సమరంలో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమిగా ఏర్పాటు అయ్యాయి. కాంగ్రెస్​ పార్టీ కమ్యూనిస్టులతో కలిసి ఇండియా కూటమిగా వెళ్తోంది. ఏపీలో మాత్రం వైఎస్సార్​ కాంగ్రెస్​ పార్టీ ఒంటరిగా బరిలో దిగింది. ఇక తెలంగాణలోనూ దాదాపు ఇదే సీన్​ కనిపిస్తోంది. ఇక్కడ బీఆర్​ఎస్​ ఒంటరిగా లోక్​సభ బరిలో ఉండగా.. కాంగ్రెస్​, కమ్యూనిస్టులు కొన్ని చోట్ల మిత్రులుగా.. మరికొన్ని చోట్ల పోటీలో మిత్రుత్వం కనబరుస్తున్నారు. ఇక.. బీజేపీ తెలంగాణలో ఒంటరిగా తమ సత్తా నిరూపించుకోవాలని భావించింది.

ఈసీ ప్రయాణం సాగిందిలా..

= పశ్చిమబెంగాల్‌ చీఫ్‌ సెక్రటరీగా విధులు నిర్వహించిన అప్పటి ఐసీఎస్‌ అధికారి సుకుమార్‌ సేన్‌.. కేంద్ర తొలి ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (CEC)గా నియమితులయ్యారు.
= ఈసీ ఏర్పాటైన దాదాపు రెండు నెలల తర్వాత 1950 మార్చి 21న ఆయన సీఈసీగా బాధ్యతలు చేపట్టారు.
= 1951-51, 1957లో జరిగిన తొలి రెండు సార్వత్రిక ఎన్నికలను సుకుమార్ సేన్‌ పర్యవేక్షించారు.
= భారత ప్రజాస్వామ్య ఎన్నికల ప్రక్రియలో సుకుమార్‌ సేన్‌ చెరగని ముద్ర వేశారు.
= ప్రస్తుతం ఎన్నికల కమిషన్‌లో ఉన్న విధివిధానాల్లో 80శాతం ఆయన తీసుకొచ్చినవే.
= 1951-52లో 489 స్థానాలకు జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో స్టీల్‌ బ్యాలెట్‌ బాక్సులను వినియోగించారు.
= 70వ దశాబ్దం చివర‌లో ఈవీఎంలను రూపొందించారు.
= 1999లో కొన్ని పార్లమెంటరీ నియోజకవర్గాలకు వాటిని విస్తరించారు.
= 2004లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 543 పార్లమెంటరీ స్థానాల్లో 10లక్షలకు పైగా ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల‌(ఈవీఎం)ల‌ను వినియోగించారు.
= తొలి ఎన్నికల నుంచే ఎన్నికల గుర్తులను తీసుకొచ్చారు.
= 1951-52 ఎన్నికల్లో గుర్తుల కోసం ఈసీ ఎంఎస్‌ సేథి అనే ఆర్టిస్ట్‌ను నియమించింది.
= రోజువారీ పనుల్లో ఉపయోగించే వస్తువులైతే ఓటర్లు సులువుగా గుర్తుపట్టడమే గాక, ఎక్కువ కాలం గుర్తుంచుకోగలరని ఆయన అధికారులకు తెలిపారు.
= దీనికోసం పెన్సిల్‌తో ప్ర‌త్యేకంగా స్కెచ్‌లు వేశారు.
= తొలి ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 27,527 పోలింగ్‌ కేంద్రాలను మహిళలకు రిజర్వ్‌ చేశారు.
= ఆ తర్వాత నుంచి దివ్యాంగులకు వీల్‌ఛైర్‌ సౌకర్యం, అంధులకు బ్రెయిలీ ఓటర్‌ స్లిప్‌లు, బ్రెయిలీలో ఈవీఎంలు వంటి సదుపాయాలను అందుబాటులోకి తెచ్చారు.
= మాజీ సీఈసీ టీఎన్ శేషన్‌ హయాంలో 1993లో తొలిసారిగా ఓటరు గుర్తింపు కార్డుల జారీ విధానాన్ని ప్రవేశపెట్టారు.
= తొలి నాళ్లలో సాధారణ పేపర్‌పై నల్ల సిరాతో ఓటర్‌ ఐడీలను ప్రింట్‌ చేసి లామినేట్‌ చేసేవారు.
= ఆ తర్వాత 2015 నుంచి కలర్‌ వెర్షన్‌లో డిజిటలైజ్డ్‌ ఫొటోతో ఈ గుర్తింపు కార్డులను జారీ చేస్తున్నారు.
= ఎన్నికల ప్రకియలో పారదర్శకతను మరింత మెరుగుపర్చేందుకు 2013లో ఓటర్‌ వెరిఫయబుల్‌ పేపర్‌ ఆడిట్‌ ట్రయల్‌ (VVPAT)ను ప్రవేశపెట్టారు.
= ఇందుకోసం 1961నాటి ఎన్నికల నిర్వహణ నిబంధనల చట్టంలో సవరణలు చేశారు.
= 2014 లోక్‌సభ ఎన్నికల నుంచి ‘నోటా (None of the Above)’ ఓటు ఆప్షన్‌ను తీసుకొచ్చారు.
= తొలి సార్వత్రిక ఎన్నికల్లో 17.3 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
= 2019 నాటికి ఆ సంఖ్య 91.19 కోట్లకు పెరిగింది.
= గత సార్వత్రిక ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 67.4 శాతం పోలింగ్‌ నమోదైంది.
= ప్రస్తుతం దేశంలో దాదాపు 97 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లు ఇటీవల ఎన్నికల సంఘం వెల్లడించింది.
= ఏప్రిల్-మే నెలల్లో సార్వత్రిక ఎన్నికలను నిర్వహించేందుకు ఈసీ తేదీలు వెల్ల‌డించింది.
= మే 13న నాలుగో విడ‌త ఎన్నిక‌లు తెలంగాణ‌, ఏపీతో స‌హా దేశంలోని 96 లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గాల్లో జ‌ర‌గుతున్నాయి.
= జూన్ 4 ఎన్నిక‌ల‌కు సంబంధించిన కౌంటింగ్ ప్ర‌క్రియ జ‌ర‌గ‌నుంది. అదే రోజు ఫ‌లితాలు విడుద‌ల చేస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement