Thursday, July 25, 2024

TS: పోలింగ్ బూత్ లో మహిళ మృతి..

ప్రభ న్యూస్ ప్రతినిధి, మేడ్చల్ మే 13: ఉప్పల్ లో విషాదం చోటుచేసుకుంది. ఓటు వేయడానికి వచ్చిన మహిళ హార్ట్ ఎటాక్ తో మృతి చెందింది. భరత్ నగర్ కి చెందిన విజయ లక్ష్మి అనే మహిళ ఓటు వేయడానికి పోలింగ్ బూత్ కి చేరుకుని పోలింగ్ స్టేషన్ లోనే పడిపోయింది.

దీంతో సదరు మహిళను పోలింగ్ సిబ్బంది, స్థానికులు హాస్పిటల్ కు తరలించారు. అప్పటికే సదరు మహిళ హార్ట్ ఎటాక్ తో మృతి చెందినదని డాక్టర్ నిర్ధారించారు. దీంతో ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement