Friday, May 3, 2024

B – ట్యాక్స్ పేరుతో వసూళ్లు.. ఎమ్మెల్యే ఏలేటి సంచలన వ్యాఖ్యలు

కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. హైద‌రాబాద్ బీజేపీ కార్యాల‌యంలో ఇవాళ‌ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. R ట్యాక్స్ తరహాలో కొత్తగా B ట్యాక్స్ వచ్చిందన్నారు. B ట్యాక్స్ పేరుతో ఓ మంత్రి విస్తృతంగా వసూళ్లకు పాల్పడుతున్నారని కీలక ఆరోపణలు చేశారు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా కాంట్రాక్టర్ల నుంచి 9శాతం B ట్యాక్స్ వసూలు చేస్తున్నాడని ఆరోపించారు.

ప్రభుత్వంలో ఎన్ని రోజులు ఉంటామో తెలీదన్నట్లు.. ఉన్నప్పుడే దండుకోవాలనే భావనతో దోచుకుంటున్నారన్నారు. కాగా, ఇటీవల బీజేపీ ఎమ్మెల్యేలను ముట్టుకుంటే 48 గంటల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేస్తామని అన్నారు. మంత్రి కోమటిరెడ్డి మతి భ్రమించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బీజేపీ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డికి టచ్‌లో ఉండటం కాదని.. ఆయన సొంత తమ్ముడు రాజగోపాల్ రెడ్డే ఆయనతో టచ్‌లో లేకుండా పోయారని ఎద్దేవా చేశారు. అలాగే కేశ‌వ‌రావు, బొంతు రామ్మోహ‌న్‌, రంజిత్ రెడ్డిల‌పై భూక‌బ్జా ఆరోప‌ణ‌లున్నాయ‌న్నారు. కాంగ్రెస్ లో చేర‌గానే వాళ్లు ఆణిముత్యాలు అయ్యారా అని ఆయ‌న ప్ర‌శ్నించారు. ధ‌ర‌ణిలో రూ.2ల‌క్ష‌ల కోట్ల కుంభ‌కోణం జ‌రిగిందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement