Tuesday, May 7, 2024

TS : చేవెళ్లలో గెలిచేది కాసాని జ్ఞానేశ్వర్ .. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

మహేశ్వరం అర్బన్, ఏప్రిల్ 28 (ప్రభ న్యూస్): చేవెళ్ల పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బిసి నాయకుడు కాసాని జ్ఞానేశ్వర్ ఓటు వేసి గెలిపించాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి వాకర్స్‌ను కోరారు. ఆదివారం ఉదయం మీర్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని చందన చెరువు , మంత్రాల చెరువుల వాకింగ్ ట్రాక్ వద్ద చేవెళ్ల పార్లమెంట్ బిఆర్ఎస్‌ పార్టీ తరపున అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ కి మద్దతుగా మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ప్రచారం చేశారు.

ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ చేవెళ్లే పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి కాంగ్రెస్ పార్టీ ల అభ్యర్థులు ఇద్దరూ బీఆర్ఎస్ పార్టీకి మోసం చేశారు. కేసిఆర్ నాయకత్వంలోనే రాష్ట్ర అభివృద్ధి జరిగిందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదని ఎద్దేవ చేశారు. ప్రజలు అంత గమనిస్తున్నారని తెలిపారు బిజెపి మతాన్ని పెట్టుకునే ఓటు అడగడం ఎంతవరకు సమంజసం అని తెలిపారు. బిజెపి కేంద్ర నుండి ఎన్ని నిధులు తీసుకొచ్చారో ప్రజలకు చెప్పాలన్నారు. ప్రజల అందుబాటులో ఉండే నాయకుడు కాసాని జ్ఞానేశ్వర్ అని తెలిపారుఈ ప్రచార కార్యక్రమంలో మీర్‌పేట్ మునిసిపల్ కార్పోరేషన్ మేయర్ యం.దుర్గా దీప్ లాల్ చౌహాన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి ,ఫ్లోర్ లీడర్ అర్కల భూపాల్ రెడ్డి ,మీర్‌పేట బీఆర్ఎస్‌ పార్టీ ప్రెసిడెంట్ అర్కాల కామేష్ రెడ్డి, మహేశ్వరం నియోజకవర్గ మహిళా ఉపాధ్యక్షురాలు విజయలక్ష్మి , కార్పోరేటర్లు మమత ప్రవీణ్, సిద్ధాల పద్మ అంజయ్య త‌దిత‌రులున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement