Thursday, May 2, 2024

కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

బెల్లంపల్లి : నల్గొండ జిల్లా నాగార్జున సాగర్‌ నియోజకవర్గంలో ఉప ఎన్నికల్లో భాగంగా చెన్నూరు ఎమ్మెల్యే, ప్రభుత్వవిప్‌ బాల్క సుమన్‌ ఆదేశాల మేరకు పెద్దకూర మండలం గర్నెకుంట గ్రామంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పీఆర్‌సీ ప్రకటించినందున కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ అహల్యమ్మ, రామాజీ యాదవ్‌, రైతు సమన్వయ సమితీ అధ్యక్షుడు బానాల నాగేశ్వర్‌రావు, గ్రామ తెరాస అధ్యక్షుడు శంకర్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు నడిపెల్లి విజిత్‌రావు, విష్ణువర్దన్‌రావు, బడికెల సంపత్‌కుమార్‌, ఆరె సమ్మయ్య, తెలంగాణ గొర్రెల, మేకల కాపరుల సంఘం రాష్ట్ర కార్యదర్శి కొమ్ము అశోక్‌ యాదవ్‌, నాయకులు శంకర్‌, నాయిని తిరుపతి, రాంబాబు, లక్ష్మణ్‌ యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement