Thursday, May 2, 2024

జ‌య‌శంక‌ర్ సార్ చిర‌స్మ‌ర‌ణీయుడు : మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా నిర్మ‌ల్ ప‌ట్ట‌ణంలో జయశంకర్ విగ్రహానికి దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించుకుంటూ, తెలంగాణ భావజాల వ్యాప్తికి జయశంకర్‌ తన జీవితాన్ని ధారపోశారని కొనియాడారు. జయశంకర్ సార్ తెలంగాణ సమాజానికి ఎన్నటికీ స్ఫూర్తి ప్రదాతగానే నిలుస్తారన్నారు. ప్ర‌త్యేక రాష్ట్ర సాధ‌న‌కు జ‌య‌శంకర్ చేసిన సేవ‌లు చిర‌స్మ‌ర‌ణీయ‌మ‌ని, వ్య‌వ‌య‌సాయ యూనివ‌ర్సిటీకి ప్రొఫెసర్ జయశంకర్ పేరు పెట్టుకున్నామ‌ని, రాష్ట్ర వ్యాప్తంగా ఆయ‌న విగ్ర‌హాల‌ను ఏర్పాటు చేసుకొని ప్ర‌తీ ఏటా ఆయ‌న‌ జ‌యంతి వేడుక‌ల‌ను నిర్వ‌హిస్తున్నామ‌ని పేర్కొన్నారు. స్వ‌రాష్ట్రంలో నీళ్లు.. నిధులు.. నియామకాలు అనే తెలంగాణ ఆకాంక్షలు నెరవేరాయన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement