Saturday, April 20, 2024

ఏపీ దేవాదాయ శాఖ సలహాదారుగా శ్రీకాంత్‌

ఏపీ దేవాదాయ శాఖ సలహాదారుగా జ్వాలాపురం శ్రీకాంత్‌ను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. జ్వాలాపురం శ్రీకాంత్‌ అనంతపురం వాసి. ఈ పదవిలో శ్రీకాంత్‌ రెండేండ్లపాటు కొనసాగుతారు. ఏపీలో వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అధికారంలోకి వచ్చిన అనంతరం పలువుర్ని ప్రభుత్వ సలహాదారులుగా నియమించిన విషయం తెలిసిందే. ఏపీ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య అధ్యక్షుడుగా కూడా సేవలందిస్తున్న జ్వాలాపురం శ్రీకాంత్‌.. గత ప్రభుత్వ హయాంతో ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్‌కు అనంతపురం నగర పాలక సంస్థ ప్రతినిధిగా కొనసాగారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement