Thursday, May 16, 2024

కరోనాతో ప్రభుత్వ ఉద్యోగి మృతి..

బెల్లంపల్లి : మంచిర్యాల జిల్లా నెన్నెల మండల ఎంపీడీఓ కార్యాలయంలో సీనియర్‌ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్‌ (49) అనే ప్రభుత్వ ఉద్యోగి కరోనా సోకి మృతి చెందారు. కొన్ని రోజుల నుండి కరోనా మహమ్మారి బారీన పడి మంచిర్యాల ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల పలువురు తీవ్ర దిగ్ర్బాంతికి గురయ్యారు. మృతునికి భార్య, కుమారుడు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement