Saturday, May 18, 2024

రేణికుంట్ల శ్రీనివాస్ కు స్టార్‌ ఐకాన్‌ అవార్డ్..

బెల్లంపల్లి : సుందరయ్య కళా విజ్ఞాన కేంద్రంలో సుమన్‌ ఆర్ట్స్‌ థియేటర్‌ ఆధ్వర్యంలో స్టార్‌ ఐకాన్‌ అవార్డు కోసం తెలంగాణ రాష్ట్రంలో ఇద్దరిని ఎంపిక చేశారు. అందులో బెల్లంపల్లి వాసి రేణికుంట్ల శ్రీనివాస్‌ ఎంపిక అయ్యారు. ఈ అవార్డును తెలంగాణ రాష్ట్ర మాజీ శాసనసభ స్పీకర్‌ సిరికొండ మధుసుదన్‌ చారి, రెవెన్యూ అధికారుల అసోసియేషన్‌ అధ్యక్షుడు దేవిశ్రీ ప్రసాద్‌, సరస్వతి, ఉపాసకులు దేవాజ్ఞ శర్మ, సుమన్‌ ప్రతిక్‌ల చేతుల మీదుగా అందుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ అవార్డుతో బరువు.. బాధ్యతలు పెరుగుతాయని అన్నారు. కరోనా సమయంలో ఆర్థికంగా వెనుకబడిన వారికి చేయూతను ఇవ్వాలని కోరారు. కరోనా విషయంలో పలు సూచనలు చేయాలని అన్నారు. అనంతరం శ్రీనివాస్‌ను అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement