Friday, May 3, 2024

5 రోజుల వ్యవధిలో దంపతులు మృతి..

బెల్లంపల్లి : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో 5 రోజుల వ్యవధిలో దంపతులు చనిపోవడంతో హనుమాన్‌ బస్తీలో విషాదం చోటు చేసుకుంది. ఈ నెల 5న మొండయ్య, జలజలకు కరోనా పాజిటీవ్‌ నిర్దారణ అయింది. భర్త కోవిడ్‌-19తో హైదరాబాద్‌ నిమ్స్‌ ఆసుపత్రిలో చేరడంతో భార్య తీవ్ర ఆందోళనకు గురై ఈ నెల 14వ తేదిన ఇంట్లోనే ఉరి వేసుకొని చనిపోయింది. ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్న మొండయ్య కూడా చనిపోయాడు. దంపతులు ఇద్దరు మృతి చెందడంతో మృతుల కుటుంబాల్లో విషాదచాయలు నెలకొన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement