Sunday, April 28, 2024

కారులో అక్రమంగా తరలిస్తున్న కలప.. పట్టుకున్న అటవీ అధికారులు

ఉట్నూర్, అదిలాబాద్ జిల్లా (ప్రభన్యూస్): ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని దంతన్ పెళ్లి సమీపంలో గల గన్ పూర్ చౌరస్తా వద్ద ఇవ్వాల (బుధవారం) సాయంత్రం కారులో అక్రమంగా తరలిస్తున్న కలప దుంగలను పట్టుకున్నట్లు బిర్సాయిపేట్ ఎఫ్ఆర్ఓ మొయినుద్దీన్ తెలిపారు.

ఆయన తెలిపిన వివరాల ప్రకారం కారులోటేకు కలప తరలిస్తున్నట్లు ముందస్తు సమాచారం మేరకు సిబ్బందితో కలిసి కారును వెంబడించి పట్టుకున్నామని, అంతలోపే డ్రైవర్ పరార్ అయ్యారని తెలిపారు. పట్టుకున్న కలప దుంగల విలువ 30 వేలు ఉంటుందని అన్నారు ను బీర్సాయిపేట్ రేంజ్ ఆఫీ సుకు తరలించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎఫ్ఆర్ఓ ప్రియాంక, బీట్ ఆఫీసర్లు ప్రతాప్, గులాబ్ సింగ్, అజయ్ సిబ్బంది పాల్గొన్నట్లు ఆయన తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement