Thursday, May 2, 2024

Hyd | వైద్యం వికటించి మృతి చెందిన యువకుడు..

కర్మన్ ఘాట్, (ప్రభ న్యూస్) : వైద్యం వికటించి కర్మన్ ఘాట్ జీవన్ ఆసుపత్రి లో యువకుడు మృతి చెందిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. వివరాలకు వెళ్ళగా..

భువనగిరి జిల్లా పోచంపల్లి మండలం దోతిగూడెం గ్రామానికి చెందిన యువకుడు సాయి (27) కడుపునొప్పి తో బాధపడుతుండటంతో బుధవారం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో జీవన్ ఆసుపత్రిలో చికిత్స కోసం చేరి నారు. మూడు గంటల ప్రాంతంలో సాయి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులకు తెలిపారు.. అయితే, వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే మృతి చెందినట్లు మృతుని బంధువులు, సిపిఎం నాయకులు కార్యకర్తలు ఆసుపత్రి ముందు సాయంకాలం 8 గంటల ప్రాంతంలో ఆందోళన చేపట్టారు.

మృతునికి భార్య, పాప, బాబు ఉన్నారు. ఆసుపత్రి వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని బంధువులు ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. ఆస్పత్రి యాజమాన్యం మృతుని కుటుంబానికి మూడు లక్షల 70 వేలు ఇచ్చేందుకు ఒప్పుకోవడంతో ఆందోళన విరమించినట్లు తెలిసింది. సంఘటన తెలుసుకున్న ఎల్బీనగర్ ఏసిపి జానకి రెడ్డి సరూర్నగర్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తమ సిబ్బందితో ఆసుపత్రికి చేరుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement