Tuesday, May 7, 2024

TS : బీఆర్ఎస్, కాంగ్రెస్…బొమ్మ బొరుసు లాంటోళ్ళు… బండి సంజ‌య్‌

బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఓకే నానానికి బొమ్మ బొరుసు లాంటోళ్ళని ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ అన్నారు. కరీంనగర్ జిల్లా హుజరాబాద్​లో ఇవాళ ఇంటింటికి బీజేపీ కార్యక్రమంలో భాగంగా బండి సంజయ్ ప్రచారం నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మీడాయాతో మాట్లాడారు.

- Advertisement -

బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు చుట్టపు చూపుకు వచ్చి పోయేవాళ్లని తెలిపారు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నాన్ లోకల్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కనీసం వాళ్ళ కార్యకర్తలకు కూడా తెలియదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతి పక్షాలు బండి సంజయ్ ని, రాములవారిని తిట్టాలి అంతే అన్నారు.ఐదు సంవత్సరాలనుండి పార్లమెంట్ పరధిలో మేము చేసిన అభివృద్ధిని ఇంటింటికి తీసుకెళ్తునామన్నారు. బీజేపీ అభివృద్ధి చేయలేదంటే ప్రజలు నమ్మే పరిస్థితులలో లేరన్నారు.

కాంగ్రెస్ పార్టీ వంద రోజుల్లో హామీలు ఎందుకు నెరవేర్చలేదన్నారు. మోడీ ప్రధాని అయితేనే అభివృద్ధి జరుగుతుందని.. సర్పంచ్ లు, నాయకులు అంటున్నారని స్పష్టం చేశారు. రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ బ్రిటిష్ పార్టీ.. బీజేపీ స్వదేశీ పార్టీ.. అన్నారు. అంబేద్కర్ పార్దివ దేహాన్ని ఢిల్లీలో కాకుండా ముంబై పంంపించింది కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేశారు. అంబేద్కర్ కల్పించిన రిజర్వేషన్ ల వల్లనే నేను ప్రధాని అయినా అని చెప్పిన వ్యక్తి మోడీ అని తెలిపారు. రాజ్యాంగాన్ని కాపాడింది బీజేపీ పార్టీ అన్నారు. బీజేపీ ప్రభుత్వం వచ్చి పది సంవత్సరాలు అయింది ఎక్కడ రిసర్వేషన్ రద్దు చేయలేదన్నారు. రాముడు అంటేనే రాక్షసులకు భయం అని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement