Saturday, April 27, 2024

బ్యాంకు ఉద్యోగుల సమ్మెను జయప్రదం చేయండి

బెల్లంపల్లి : బ్యాంకు ఉద్యోగుల సమ్మెను జయప్రదం చేయాలని ఏఐసీటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సబ్బని కృష్ణ పిలుపునిచ్చారు. బ్యాంకుల ప్రైవేటీకరణకు నిరసనగా ఈ నెల 15, 16వ తేదిల్లో బ్యాంకు ఉద్యోగులు
చేస్తున్న సమ్మెను జయప్రదం చేయాలని కోరారు. కార్పోరేట్‌ కంపెనీలకు తాకట్టు పెట్టే విదంగా నిర్దాక్షిన్యంగా అమ్మివేసే విధంగా కార్మిక వర్గానికి తీరని ద్రోహం చేస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్ని ప్రభుత్వరంగ సంస్థలతో పాటు బ్యాంకు రంగాన్ని కూడా ప్రైవేటు పరం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడని, ఇలా ప్రజా వ్యతిరేక, కార్మిక వ్యతిరేక విధానాలను అవలంభిస్తూ కార్పోరేట్‌ శక్తులకు ఊడిగం చేస్తుందని అన్నారు. ఈ సమ్మెలో పాల్గొని కేంద్ర ప్రభుత్వం, పాలకులకు బుద్దిచెప్పాలని, ఈ సమ్మెకు ఏఐసీటీయూ, ఎంసీపీఐ(యూ) సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాజేంద్రప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement