Sunday, May 12, 2024

గ్రీన్ఇండియా ఛాలెంజ్ స్వీక‌రించిన న‌టి ఆషిమా న‌ర్వాల్

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా సినీ నటి ఆషిమా నర్వాల్ జూబ్లీహిల్స్ జీహెచ్ఎంసీ పార్క్ లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆషిమా నర్వాల్ మాట్లాడుతూ… పర్యవరణాన్ని కాపాడుకోవడం కోసం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఎంతగానో తోడ్పడుతుందని అన్నారు. వాతావరణంలో మార్పులను అరికట్టాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని కోరారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ఛాలెంజ్ ఎంతగానో అవసరమన్నారు. ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన ఎంపీ సంతోష్ కుమార్ కి ఆషిమా కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఆషిమా నర్వాల్ తన స్నేహితులు యశా వీరమంచి, వెంకట్రావ్, ప్రశాంత్ రెడ్డి, హర్షం గుర్రం కొండ నలుగురికి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసిరారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement