Monday, April 29, 2024

కారు హెడ్ లైట్స్ వెలుతురులో – ప‌రీక్ష రాసిన విద్యార్థులు

బీహార్ వ్యాప్తంగా 12వ త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు ప్రారంభ‌మ‌యిన సంగ‌తి తెలిసిందే. హిందీ ఎగ్జామ్ ని రెండు భాగాలుగా నిర్వ‌హించారు. తొలిభాగాన్ని నిన్న ఉద‌యం రాశారు విద్యార్థులు. కాగా రెండో పేప‌ర్ షెడ్యూల్ లో మ‌ధ్యాహ్నం 11 గంటల 45 నిమిషాల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్ణయించారు. అయితే మహారాజా హరేంద్ర కిషోర్ సింగ్ పరీక్షా కేంద్రంలో ముందస్తుగా విద్యార్థుల సీటింగ్ ఏర్పాటు చేయకపోవడంతో గందరగోళం తలెత్తింది. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ క్రమంలోనే పరీక్ష ఆలస్యంగా మొదలయ్యింది.

అప్పుడే అసలు సమస్య మొదలైంది. ఆ కాలేజీకి ఎలాంటి విద్యుత్ సరఫరా లేకపోవడంతో జనరేటర్లతో నడిపిస్తున్నారు. అయితే కొన్ని గదుల్లో ఆ సౌకర్యం కూడా లేక, కొంతమంది విద్యార్థులను కారిడార్లలో కూర్చోబెట్టారు. కానీ అప్పటికే చీక‌టి పడింది. దీంతో కార్లలో వచ్చిన కొంతమంది విద్యార్థుల తల్లిదండ్రులు కారు హెడ్ లైట్లు ఆన్ చేయడంతో ఆ వెలుతురులో విద్యార్థులు పరీక్ష పూర్తి చేయ‌డం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో రావడంతో ఇది వివాదాస్పదంగా మారింది. దీనిపై తూర్పు చంపారన్ జిల్లా కలెక్టర్ స్పందించారు. ఈ ఘటనపై దర్యాప్తు కోసం జిల్లా విద్యాధికారి నేతృత్వంలోని కమిటీని నియమించినట్లు తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement