Monday, May 6, 2024

బీజేపీ నాయకుల ముందస్తు అరెస్ట్

వికారాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్యాంగాన్ని తిరిగి రాయాలని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ను అవమానించినందుకు బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ అంబేద్క‌ర్ విగ్ర‌హం వద్ద భీమ్ దీక్ష చేప‌ట్టాల‌ని పిలుపునిచ్చారు. ఈమేర‌కు ఈరోజు ఉదయం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద భీమ్ దీక్ష కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలుసుకున్న పోలీసులు ముందస్తుగా జిల్లా బీజేపీ అధ్యక్షుడు సదానంద రెడ్డితో పాటు బీజేపీ నాయకులను అరెస్టు చేయడం జరిగిందని వికారాబాద్ టౌన్ సీఐ రాజశేఖర్ తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement