Tuesday, July 23, 2024

MBNR : నిత్యాన్నదానానికి విరాళం అంద‌జేత‌

అచ్చంపేట, మే 12 (ప్రభ న్యూస్): శ్రీశైలం ఉత్తర ద్వారంగా ప్రఖ్యాతిగాంచిన ఉమామహేశ్వర స్వామి దేవస్థానంలో నిత్యాన్న‌దానానికి మర్రిపల్లికి చెందిన స‌త్తుదిలీప్‌రావుమేఘ‌న‌లు విరాళం అంద‌జేశారు. ఇవాళ స‌త్తుదిలీప్ దంప‌తులు కూతురు ఇషా, కుటుంబసభ్యులతో క‌లిసి స్వామివారిని ద‌ర్శించుకొని ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు.

- Advertisement -

అనంత‌రం 25 వేల రూపాయల విరాళాన్ని ఆలయ చైర్మన్ కందూరు సుధాకర్ కు అందజేశారు. ఈ సందర్భంగా దాత సత్తు దిలీప్ రావు మాట్లాడుతూ ఆలయ చైర్మన్ కందూరు సుధాకర్ ఆధ్వర్యంలో ఉమామహేశ్వర క్షేత్రం దినదినంగా అభివృద్ధి చెందుతుందని, భక్తులకు అన్ని రకాల వత్తులతో పాటు అనునిత్యం అన్నదానం చేయడం చాలా పెద్ద విషయమని, ఇట్టి మహత్తర కార్యక్రమంలో మేము కూడా పాలుపంచుకోవాలని, ఆ పరమేశ్వరుని కృపా కటాక్షాలు అందరిపై ఉండాలని ఆ భగవంతుని కోరుతున్నామని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement