Saturday, May 25, 2024

రెండు రైళ్లు ఢీకొని… 53మందికి పైగా గాయాలు

రెండు రైళ్లు ఢీకొన‌డంతో 53మందికి పైగా గాయాలైన ఘ‌ట‌న‌ మహారాష్ట్రలో చోటుచేసుకుంది. రాష్ట్రంలోని గోండియా జిల్లాలో ఎదురుగా వస్తున్న గూడ్సు రైలును మరో రైలు ఢీకొట్టింది. దీంతో ప్యాసింజర్‌ రైలులోని మూడు బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో 53 మందికిపైగా గాయపడ్డారు. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరుగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.భగత్‌ కి కోఠీ ప్యాసింజర్‌ రైలు ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌ నుంచి రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌కు వెళ్తున్నది.

ఈ క్రమంలో ఈరోజు తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో మహారాష్ట్రలోని గోండియా సిటీ సమీపంలో ఎదురుగా వస్తున్న ఓ గూడ్స్​ ట్రైన్‌ను ఢీకొట్టింది. దీంతో మూడు బోగీలు పట్టాలు తప్పడంతో 53 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న అధికారులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడినవారిని చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement