Sunday, May 26, 2024

Big Breaking | ఇంటర్​సిటీకి ఎదురెళ్లిన వ్యక్తి.. పట్టాలపై 20 నిమిషాలు హంగామా!

కామారెడ్డి జిల్లాలో విచిత్ర ఘటన జరిగింది. కామారెడ్డి రైల్వే స్టేషన్​లో ఓ వ్యక్తి ఇవ్వాల (శనివారం) రాత్రి కొద్దిసేటక్రితం హల్​ చల్​ చేశాడు. ఇంటర్​ సిటీ ట్రైన్​కు ఎదురెళ్లి కాసేపు హంగామా సృష్టించాడు. అతడిని గమనించిన లోకోపైలట్​ అప్రమత్తమై రైలుని నిలిపేశాడు. రైల్వే అధికారులు హుటాహుటిన అక్కడికి తరలివచ్చారు. పరిస్థితి గమనించి అతడిని బయటకు తీసుకొచ్చేందుకు యత్నించారు. అయినా.. పట్టాల మీద నుంచి రాకుండా ఇట్లా దాదాపు 20 నిమిషాల పాటు రైలుని పట్టాలమీద  కదలకుండా ఆపేశాడు. అకారణంగా రైలుని ఆపేసి హల్​చల్​ చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement