Saturday, May 25, 2024

పెళ్లి అయిన వారానికే రోడ్డు ప్రమాదం.. ఎస్ఐ దుర్మరణం

నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం మాల్ వద్ద శనివారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మృతుల్లో వికారాబాద్ వన్ టౌన్ ఎస్సై శ్రీనివాస్ నాయక్ కూడా ఉన్నారు. సంఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. డిసెంబర్  26న శ్రీనివాస్ నాయక్ కు మాల్ లో వివాహం జరిగింది. ఒడిబియ్యం కార్యక్రమాన్ని ముగించుకుని ఆటోలో వెళ్తుండగా దేవరకొండ డిపోకు చెందిన ఆర్టీసి బస్సు ఆటోను ఢీ ఢీకొట్టింది. ఈ సంఘటనలో ఎస్సై శ్రీనివాస్ నాయక్ తో పాటు అతని తండ్రి మాల్యా నాయక్ లు అక్కడికక్కడే మృతిచెందారు. మృతులు రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలం మాన్య తండా వాసులుగా గుర్తించారు.

శ్రీను నాయక్ వారం క్రితమే వికారాబాద్ వన్ టౌన్ ఎస్ఐ గా బాధ్యతలు స్వీకరించారు. శ్రీనివాస్ నాయక్ తండ్రి మాన్య ఆటో డ్రైవర్ కాగా ఇటీవల తండ్రి చేతికి గాయం కావడంతో స్వయంగా ఆటో నడిపారు. ప్రమాదంలో ఆటోలో ప్రయాణించిన తండ్రీకొడుకులు ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. కాళ్ళపారాణి ఆరకముందే ఇరు కుటుంబాల్లో విషాదఛాయలు నెలకొన్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement