Wednesday, May 22, 2024

మైన‌ర్ బాలుడి వ‌ద్ద హెరాయిన్.. స్వాధీనం చేసుకున్న పోలీసులు

ఓ మైన‌ర్ బాలుడి వ‌ద్ద నుండి 15కేజీల హెరాయిన్ ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బాలుడి వ‌ద్ద ఉన్న 8.4 ల‌క్ష‌ల న‌గ‌దును కూడా సీజ్ చేశారు. అమృత‌స‌ర్ రామ్ తీర్థ రోడ్డు వ‌ద్ద బాలుడిని ప‌ట్టుకున్నారు. ఇంటెలిజెన్స్ ఇచ్చిన స‌మాచారం మేర‌కు ఆ కుర్రాడి నుంచి 15 కేజీల హెరాయిన్‌ను పట్టుకున్నామ‌ని డీజీపీ గౌర‌వ్ యాద‌వ్ ఓ ట్వీట్‌లో తెలిపారు. ట్రాన్స్ బోర్డ‌ర్ నార్కోటిక్స్ స్మ‌గ్లింగ్ రాకెట్ న‌డుపుతున్న రేష‌మ్ సింగ్ ప‌రారీలో ఉన్న‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. నార్కోటిక్స్ డ్ర‌గ్స్ సెక్ష‌న్ల కింద కేసును బుక్ చేసిన‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement